Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ బంధానికి 'డోక్లాం' ఎసరు.. భారత్‌కు చైనా వార్నింగ్

భారత్, చైనా దేశాల మధ్య డోక్లాం వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగా ఉభయ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (09:50 IST)
భారత్, చైనా దేశాల మధ్య డోక్లాం వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగా ఉభయ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇపుడు మరోమారు చైనా ఈ అంశాన్ని లేవనెత్తుతూ, భారత్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనిపై భారత్ కూడా ఒకింత ఘాటుగానే స్పందించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు వద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. 
 
భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో డోక్లాం ఉంది. ఈ ప్రాంతం మీదుగా పాకిస్థాన్ వరకు చైనా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చైనా తాజాగా వార్నింగ్ ఇచ్చింది. 
 
ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక బంధాలను దెబ్బతీసేంతగా డోక్లాం మారిపోయిందని, భారత్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని, ఆ ప్రాంతం చైనాదేనని చెప్పేందుకు ఎటువంటి సందేహాలూ లేవని వాదించింది. 
 
ప్రస్తుతం ఇండియాలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రష్యా - ఇండియా - చైనా విదేశాంగ శాఖ స్థాయి సమావేశంలో పాల్గొన్న వేళ, సుష్మా స్వరాజ్ తో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంవత్సరం జూన్ నుంచి దాదాపు 73 రోజుల పాటు డోక్లాం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం