Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దు.. అమెరికాకు తేల్చిచెప్పిన భారత్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (07:55 IST)
సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతోంది. గురువారం మొదలైన ఈ సదస్సు.. శుక్రవారం రెండోరోజు కొనసాగింది. సదస్సుకు హాజరైన ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రులు తమ దేశాల మధ్య సంఘీభావానికి సూచికగా చేయిచేయి కలిపి ఫొటోలకు పోజులిచ్చారు.
 
 భారత విదేశాంగ మంత్రి జయశంకర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశం అయ్యారు. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. కశ్మీర్ సమస్యను భారత్ – పాకిస్థాన్ రెండు దేశాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ.. మరే దేశం జోక్యం కానీ అవసరం లేదని జయశంకర్ మైకేల్ పాంపియోకు క్లియర్ గా చెప్పారు.
 
 పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ తన కామెంట్స్ తో సంచలనం రేపారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేయాలని భారత ప్రధాని, పాక్ ప్రధాని తనను అడిగారని ట్రంప్ చెప్పడంపై పెద్ద దుమారం రేగింది. ట్రంప్ మాట్లాడిన తర్వాత.. భారత్, పాక్ దేశాలు మొట్టమొదటగా చర్చించుకున్నది బ్యాంకాక్ లోని ఆసియాన్ సదస్సులోనే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లోనే… కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని.. అమెరికాకు తేల్చిచెప్పింది ఇండియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments