Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృత్రిమ వర్షంతో ఎండ నుంచి ఉపశమనం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 22 జులై 2021 (16:09 IST)
గతంలో మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రువు స‌మ‌యంలో రాయలసీమ ప్రాంతాల్లో మేఘమథనం (కృత్రిమ వర్షం) చేపట్టారు. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల కృత్రిమ వ‌ర్షాలు కురిపించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
కానీ ఎడారి దేశ‌మైనా వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఎప్పుడూ ముందుండే యూఏఈ ఓ కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగించి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దేశంలో ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను కూడా తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దుబాయ్ ఓ వినూత్న ప్ర‌య‌త్నం చేసింది.
 
ఈ కొత్త టెక్నాల‌జీలో భాగంగా డ్రోన్ల సాయంతో మేఘాల‌కు షాకిచ్చి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దుబాయ్‌లోని ఓ హైవేపై ఇలా వ‌ర్షం కురుస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి క్లౌడ్ సీడింగ్ ద్వారానే యూఏఈ కృత్రిమ వ‌ర్షాలు కురిపిస్తోంది. 
 
ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. అది కాస్తా మేఘాల్లో ఎల‌క్ట్రిక‌ల్ బ్యాలెన్స్‌ను మార్చి వ‌ర్షం కురిపిస్తాయి. మేఘాల్లోని వ‌ర్ష బిందువుల‌ను చార్జ్ చేయ‌డానికి తాము ఇలా డ్రోన్ల‌ను పంపిస్తున్న‌ట్లు ఈ ప్రాజెక్ట్‌పై ప‌ని చేసిన శాస్త్రవేత్త డాక్ట‌ర్ కెరి నికోల్ చెప్పారు. ఈ కొత్త టెక్నాల‌జీ యూఏఈలో వ‌ర్ష‌పాతాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments