Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో భూకంపం: ఉత్తరాదినే కాకుండా.. దాయాది దేశంలోనూ..?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (09:33 IST)
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాల వణుకుతున్న తరుణంలో.. భారత దేశంలో ఉత్తరాదిన, దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. తజికిస్థాన్, భారతదేశాల్లో సంభవించిన భూకంపం పాకిస్థాన్ దేశాన్ని కూడా వణికించింది. పాకిస్థాన్ దేశంలో శుక్రవారం రాత్రి 10.02 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని పాక్ మెట్రోలాజికల్ డిపార్టుమెంట్ వెల్లడించింది. 
 
పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్,పంజాబ్, ఫక్తూన్ ఖవా, బలోచిస్థాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు ఊగిపోయాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది. 
 
భూప్రకంపనలతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. 80 కిలోమీటర్ల లోతులో నుంచి సంభవించిన భూకంపం అనంతరం పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments