Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వాన్ లోయలో 100 మంది చైనా సైనికుల మృతి???

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:44 IST)
గత నెల 15వ తేదీన తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ సైన్యానికి చెందిన 21 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపున కూడా అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, 40 నుంచి 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మృతుల సంఖ్యపై చైనా ఎన్నడూ పెదవి విప్పలేదు. 
 
ఈ క్రమంలో చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారి క్సీ ఒకరు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదేసమయంలో చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని కూడా ఆరోపించారు. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరపు నుంచి ఎన్నడూ బయటకు రాదని ఆయన అన్నారు.
 
గాల్వాన్ లోయలో పెద్ద యుద్ధమే జరిగిందనీ, అక్కడ 100 మందికిపైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన సీపీఏ మాజీ సైనికుడు క్సీ, ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలమని అన్నారు. క్సీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments