Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటలతో మాయచేసి.. టీలో మత్తుమందు కలిపి.. శీలాన్ని దోచుకున్నాడు...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (15:37 IST)
ఆ మహిళను మాటలతో మాయచేశాడు. సమస్యలను పరిష్కరిస్తాను ఇంటికి రమ్మన్నాడు.. ఆయన మాటలు నమ్మి ఇంటికెళ్తే తేనీరులో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫ్లోరిడాకు చెందిన జీన్ ఫిలిప్స్ అనే వ్యక్తికి దైవభక్తి ఎక్కువ. దీంతో ఆయన వద్దకు అనేక మంది స్థానికులు వచ్చిన తమ సమస్యల పరిష్కారం కోసం సలహాలు సూచనలు అడిగి వెళుతుంటారు. ఇదేవిధంగా ఓ మహిళ ఆయన వద్దకు వెళ్లింది. ఆమెను మాటలతో మాయచేశాడు. 
 
తన మాట దేవుడు వింటాడని, తను ప్రార్థిస్తే ఖచ్చితంగా ఎవరి కష్టాలనైనా ఇట్టే తీర్చేస్తాడని ఆ మహిళను నమ్మించాడు. ఆయన మాటలను గుడ్డిగా నమ్మిన ఆ మహిళ ఓ రోజున ఆ వ్యక్తి ఇంటికి పిలవడంతో వెళ్లింది. 
 
ఇంటికొచ్చిన ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తేనీరు ఇచ్చింది. ఈ టీ తాగడంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. రెండు గంటలు తర్వాత మెలకువ వచ్చి చూస్తే ఇంట్లోని పడగ గదిలో నగ్నంగా ఉంది. దీంతో తాను మోసపోయానని, తాను అత్యాచారానికి గురైనట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, గతంలో కూడా అనేక మంది మహిళలను ఇదేవిధంగా మోసం చేసినట్టు తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments