Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొటబాయ రాజపక్సేకు షాకిచ్చిన సింగపూర్

Webdunia
సోమవారం, 18 జులై 2022 (13:38 IST)
దేశాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో నెట్టేసి ఆ దేశం నుంచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత ఆయన కొలంబో నుంచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ శ్రీలంక జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సింగపూర్‌లో అడుగుపెట్టారు. 
 
అయితే ఇప్పుడు ఆయన తమ దేశం వీడాలని సింగపూర్ కోరుకుంటోంది. ఆయన తమ దేశంలో ఉండేందుకు గడువును పొడిగించలేమని ఆ దేశ అధికారులు గొటబాయకు తేల్చిచెప్పినట్లు సమాచారం. 
 
శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేని గొటబాయ.. భార్యతో కలిసి మొదట మాల్దీవులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గురువారం సింగపూర్ చేరుకున్నారు. ఆ దేశంలో దిగే సమయానికి ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. ఆయన అధ్యక్ష హోదాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని అప్పుడు సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. 
 
అయితే ఆయన మరికొన్ని రోజులు తమ దేశంలో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆయన ఆశ్రయం కోరలేదని, తాము కూడా ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన కొద్ది రోజుల క్రితమే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సింగపూర్‌ నుంచి ఈ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments