Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దాడికి చైనా సన్నాహాలు? టిబెట్‌కు చేరువలో చైనా బాంబర్లు

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (09:02 IST)
భారత్‌పై దాడి చేసేందుకు డ్రాగన్ కంట్రీ సన్నాహాలు చేస్తుందా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. భారత్‌కు చేరువలో టిబెట్‌ భూభాగంలో తన సైనిక సత్తాను చైనా క్రమంగా పెంచడమే దీనికి నిదర్శనమని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, టిబెట్‌కు సమీపంలో చైనా బాంబర్ విమానాలను మొహరించడం ఇపుడు ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తలు పెంచేలా ఉన్నాయి. 
 
తాజాగా హెచ్‌-6 అనే అధునాతన బాంబర్‌ విమానాలను మోహరించింది. హాపింగ్‌ వైమానిక క్షేత్రంలో వీటిని రంగంలోకి దించింది. ఇది భారత్‌లోని సిక్కిం సరిహద్దుకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పౌర, సైనిక విమానాల కార్యకలాపాలకు పనికొచ్చే ఈ స్థావరాన్ని చైనా సైన్యం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. 155 ఎంఎం శతఘ్నులనూ అక్కడ మోహరించినట్లు సమాచారం.
 
సోవియట్‌ హయాం నాటి టుమోలెవ్‌ టీయూ-16 బాంబర్‌ ఆధారంగా హెచ్‌-6ను చైనా రూపొందించింది. ఇది దీర్ఘశ్రేణి దాడులకు పనికొస్తుంది. దీన్ని వ్యూహాత్మక బాంబర్‌గా కూడా పేర్కొంటున్నారు. అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా విమానవాహక నౌకలపై దాడి చేయగల సత్తా దీనికి ఉందని భావిస్తున్నారు. ఇలాంటి ఆయుధాన్ని తన పొరుగున మోహరించడంపై భారత్‌ దృష్టి సారించింది. ఒకవేళ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ బాంబర్‌ ఎలాంటి పాత్ర పోషించనుంది వంటి అంశాలపై భారత భద్రతా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments