Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లాం వివాదం తర్వాత జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ భేటీ

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొల

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:28 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా డోక్లాం వివాదం తర్వాత రెండు దేశాల అధినేతలు కలుసుకోనుండటం ఇదే తొలిసారి. 
 
మయాన్మార్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోడీ మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారని భారత విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అయితే చర్చాంశాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇటీవల సిక్కిం సమీపంలోని డోక్లాంలో భారత, చైనా దళాలు నువ్వానేనా అన్నట్టుగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలావుండగా, బ్రిక్స్ శిఖరాగ్ర సభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్‌తోనూ ప్రధాని మోడీ విడిగా సమావేశమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments