Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తమోడిన కాబూల్‌ - బాంబు పేలి 66 మంది మృతి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (09:21 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ మసీదులో శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 66 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఖలీసా సాహిబ్ మసీదుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో మసీదు కిక్కిరిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ ఉగ్రవాది మానవబాంబుగా మారి తనను తాను పేల్చుకున్నాడు. 
 
అప్పటివరకు ఎంతో కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారికాగ రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. సున్నీ తెగకు చెందిన ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. శనివారం ఉదయం వరకు 66 మంది చనిపోయారు. మరో 78 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
అయితే, ఈ మానవబాంబు పేలుడుకు ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థా నైతిక బాధ్యత వహించలేదు. పేలుడుపై ఆప్ఘన్ భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మసీదు వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూడా కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments