Webdunia - Bharat's app for daily news and videos

Install App

356 నుంచి 492 వరకు అణు బాంబులను తయారు చేసే సత్తా భారత్ సొంతం.. పాక్ మేధావి బృదం

పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసే విషయాన్ని ఆ దేశానికి చెందిన మేధావి బృందం వెల్లడించింది. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇప్పటికిపుడు సుమారు 356 నుంచి 492 వరకు అణు బాంబుల్ని తయారుచేయగలిగి

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (13:05 IST)
పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసే విషయాన్ని ఆ దేశానికి చెందిన మేధావి బృందం వెల్లడించింది. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇప్పటికిపుడు సుమారు 356 నుంచి 492 వరకు అణు బాంబుల్ని తయారుచేయగలిగిన సత్తా భారత్‌ కలిగి ఉందని ఈ బృందం విశ్లేషించింది. ఈ మేరకు సాంకేతిక సామర్ధ్యాన్ని, ముడి సరుకును భారత్‌ కలిగి ఉందని ఈ బృందం అధ్యయనంలో తేల్చింది. 
 
ఇస్లామాబాద్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌(ఐఎస్‌ఎస్‌ఐ)’ - భారత అరక్షిత అణు కార్యక్రమం - పేరుతో ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అణు బాంబుల తయారీలో భారత్‌ సత్తాపై గతంలో జరిగిన పలు అధ్యయనాలకు భిన్నంగా ఇందులో తేలినట్లు ఐఎస్‌ఎస్‌ఐ పేర్కొంది. సంక్లిష్టమైన భారత అణు కార్యక్రమంలోని వివిధ అంశాలపై వాస్తవాలను, సామర్ధ్యాలను వెల్లడించడమే ఈ అధ్యయనం ఉద్దేశమని పేర్కొంది.
 
కాగా, యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, నియంత్రణ రేఖ వద్ద పాక్ రేంజర్లు యధేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దాడులకు ధీటుగానే భారత్ దళాలు కూడా స్పందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ మేధావి బృందం వెల్లడించిన విషయాలు ఆ దేశ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేవిలా ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments