Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ కంట్రీ కొత్త ఆంక్షలు.. భారత్‌తో పాటు విదేశీయులపై వీసా నిషేధం

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (11:29 IST)
కరోనా మహమ్మారి నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా తాజాగా కొత్త ఆంక్షలను విధించింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల విదేశీయులపై వీసా నిషేధాన్ని చైనా విధించింది. వీసా ఉన్నవారికి కూడా తాత్కాలికంగా ఎంట్రీని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలో ఉన్న చైనా ఎంబసీ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన, సేవాపరమైన, సీ వీసాలు ఉన్నవారికి ఈ నిషేధం వర్తించదు అని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. 
 
అత్యవసరం ఉన్నవారు, మానవతా సాయం చేసేవారు.. చైనా ఎంబసీలో దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎంబసీ వెల్లడించింది. కరోనా పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని చైనా వెల్లడించింది. చైనా విధించిన నిషేధం కేవలం భారత్‌కు మాత్రమే కాదు అని, ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
నవంబర్ 3వ తేదీ తర్వాత వీసాలు జారీ అయినవారికి ఈ ఆంక్షలు వర్తించవు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, బంగ్లాదేశ్‌, పిలిప్పీన్స్ దేశాల నుంచి వస్తున్న వారిపైన కూడా చైనా తాత్కాలిక నిషేధం విధించింది. తాత్కాలిక నిషేధానికి సంబంధించి చైనా ఎంబసీ తన నోట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments