Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ట్రాక్‌పై పడిన కుమార్తెలు.. కాపాడిన టెక్కీ... చివరికి ఏమైందంటే?

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (10:09 IST)
ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పై పడిన తన కుమార్తెలను రక్షించే ప్రయత్నంలో ఇన్ఫోసిస్ టెక్కీ ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే, 40 ఏళ్ల ఆనంద్ రన్వాల్ సిడ్నీలో పనిచేసే ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి. 
 
ఆదివారం (జూలై 21) మధ్యాహ్నం 12.25 గంటలకు ఆనంద్ తన భార్య, కవల కుమార్తెలతో కలిసి కార్ల్‌టన్ స్టేషన్‌లో ఉన్నాడు. కుటుంబ సభ్యులు లిఫ్ట్‌పై నుంచి కిందకు దిగిన తర్వాత ప్రమాదవశాత్తు చిన్నారులు ఉన్న ప్రామ్ రైల్వే ట్రాక్‌పైకి బోల్తా పడింది.
 
ఆనంద్ తన కూతుళ్లను కాపాడేందుకు ప్లాట్ ఫామ్‌పై నుంచి రైల్వే ట్రాక్ పైకి దూకాడు. ఈ క్రమంలో పెద్ద కూతురుని కాపాడగలిగాడు. అయితే ఆనంద్, అతని చిన్న కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన ఆనంద్ భార్య, అతని కుమార్తెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇకపోతే.. ఆనంద్ అతని కుటుంబం 2023 చివరలో సిడ్నీకి మారారు. వారు సిడ్నీలోని కొగరా శివారులో ఉండేవారు. ఇటీవల, ఆనంద్ తల్లిదండ్రులు సిడ్నీలో అతనిని సందర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments