Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోర ప్రమాదం: నౌకలు ఢీ... 32మంది గల్లంతు.. జలాలు కలుషితం

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. ''సాంచీ'' అనే నౌక 64వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ''సీఎఫ్ క్రిస్టల్'' అనే సరుకు రవా

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (09:35 IST)
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. ''సాంచీ'' అనే నౌక 64వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ''సీఎఫ్ క్రిస్టల్'' అనే సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. షాంఘైకి 160 నాటికల్  మైళ్ల దూరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే చమురు రవాణా నౌకకు మంటలు అంటుకోవడంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం చేకూరింది. ఆయిల్ ట్యాంకర్- సరుకు రవాణా నౌక ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. గల్లంతైన వారిలో 30 మంది ఇరాన్ దేశస్తులు, ఇద్దరు బంగ్లాదేశీయులు వున్నారు.
 
ఈ ప్రమాదం ద్వారా చమురు ఒలికిపోవడంతో చైనా సముద్ర జలాలు కలుషితం అయినట్లు చైనా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments