Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు.. పాకిస్థాన్ వెళ్లి మతం మారి.. ప్రియుడిని పెళ్లాడింది..

పాకిస్థాన్‌లోని ''జాతా'' అనే పవిత్ర స్థలాన్ని ప్రతి ఏడాది భారత్‌లోని సిక్కులు సందర్శిస్తుంటారు. ఇలా జాతా తీర్థయాత్ర కోసం పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన సిక్కు మహిళ మతం మారింది. అంతటితో ఆగకుండా ముస

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (09:25 IST)
పాకిస్థాన్‌లోని ''జాతా'' అనే పవిత్ర స్థలాన్ని ప్రతి ఏడాది భారత్‌లోని సిక్కులు సందర్శిస్తుంటారు. ఇలా జాతా తీర్థయాత్ర కోసం పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన సిక్కు మహిళ మతం మారింది. అంతటితో ఆగకుండా ముస్లిం వ్యక్తిని పెళ్లాడింది.


పెళ్లై ముగ్గురు పిల్లలున్న మహిళ సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ వ్యక్తిని ప్రేమించి.. యాత్ర పేరిట జాతాకు వెళ్లి.. మతం మారి ప్రియుడిని వివాహం చేసుకోవడంపై భారత అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కోడల్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిక్కు మహిళ మామయ్య విదేశాంగ శాఖను విజ్ఞప్తి చేశారు. 
 
వివరాల్లోకి వెళితే హోషియాపూర్‌లోని గర్‌శంకర్ పట్టణానికి చెందిన కిరణ్ బాల (31)కు ఇది వరకే వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన లాహోర్‌కు చెందిన మొహమ్మద్ ఆజంను పెళ్లాడేందుకు తన ముగ్గురు పిల్లలను మామయ్య వద్ద వదిలేసి పాకిస్థాన్ చేరుకుంది. అక్కడ మతం మార్చుకుని ప్రియుడిని పెళ్లాడింది. ఈ ఘటనపై గురుద్వారా నిర్వహణ కమిటీ మండిపడింది. ఇది ముమ్మాటికీ భారత ఇంటెలిజెన్స్ అధికారుల తప్పిదమేనని శిరోమణి గురుద్వారా నిర్వహణ కమిటీ ఆరోపించింది.
 
ఈసారి జాతాకు 1800 మంది భారతీయులు వెళ్లారు. వీరిలో పాటు జాతా వెళ్లిన కిరణ్ ఇస్లాం మతం పుచ్చుకుని తన పేరును అమ్నా బీబీగా మార్చుకుంది. అయితే తన కోడలిని తిరిగి భారత్ రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా ఆమె మామ, మాజీ మతపెద్ద తార్సెం సింగ్ విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ను విజ్ఞప్తి చేశారు. తన కోడలు ఐఎస్ఐ మాయలో పడిందని వాపోయారు కానీ కిరణ్ బాల అలియాస్ అమ్నా బీబీ మాత్రం తనను ఎవ్వరూ బలవంతం పెట్టలేదని.. తన ఇష్ట ప్రకారమే మారానని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments