Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించిన న్యూజిలాండ్‌

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:52 IST)
న్యూజిలాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంలో భారత్‌ నుండి వచ్చే ప్రయాణీకులపై ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ రెండు వారాల పాటు తాత్కాలికంగా నిషేధం విధించారు. తమ దేశ ప్రజలకు కూడా ఇది వర్తించనుందని అక్లాండ్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

గురువారం న్యూజిలాండ్‌ సరిహద్దుల్లో చేపట్టిన పరీక్షలో 23 మందికి కరోనా సోకగా..అందులో 17 మంది భారత్‌ నుండి వచ్చిన వారే. దీంతో భారత్‌ నుండి న్యూజిలాండ్‌కు వచ్చే పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో కూడా సెకండ్‌ వేవ్‌ నడుస్తుండటంతో పాటు కొన్ని రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి విదితమే.

ఏప్రిల్‌ 11 నుండి... స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్‌ 28 వరకు ఈ తాత్కాలిక నిషేధం విధించనుంది. ఈ సమయంలో ప్రయాణాలను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం పరిశీలించనుంది.

భారత్‌ నుండి వచ్చిన వారి ద్వారా కేసులు పెరుగుతున్నాయని, దేశంలోకి ప్రవేశించే పాయింట్ల వద్ద కేసులు నియంత్రించేందుకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో యోచిస్తున్నామని జెసిండా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments