Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (12:37 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కన్నెర్రజేసింది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఊహించని విధంగా షాక్ కొట్టినట్టయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్థాన్‌కు వెళ్లే జలాలు ఆగిపోయాయి. ఫలితంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కష్టాలు ఈ యేడాది రబీ సీజన్ నుంచే మొదలుకానున్నాయి. ఇప్పటికే పలు పాకిస్థాన్ కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. 
 
ఈ ఒప్పందం రద్దుతో ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఎస్ఆర్ఏ) అంచనా ప్రకారం... సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ప్రభావం పాకిస్థాన్‌కు వెళ్ళే నీటిలో 21 శాతం మేరకు కోతపడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా చినాబ్ నదిలో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణం అవుతుందని తేల్చింది. ఇప్పటికే సలాల, బిగ్ లిహార్ డ్యామ్ గేట్లు మూసివేయడంతో పాక్‌కు వెళ్లేనీరు చాలా వరకుతగ్గింది. 
 
మరాల వద్ద నీటి కొరత దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఖరీఫ్ సీజన్‌పై పడనుంది. ఇలాంటి చర్యలే కిషన్ గంగాపై కూడా భారత్ భావిస్తోంది. మే నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్‌కు నీటి లభ్యతను అంచనా వేయడానికి ఐఎస్ఆర్ఏ సమావేశమైంది. ఇందులో పలు అంశాలపై చర్చించి ఓ అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments