Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఫీజ్ సయ్యీద్‌కు షాక్: పాకిస్థాన్‌ ఏం చేసిందో తెలుసా?

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అతనికి షాకివ్వాలని పాకిస్థాన్ రంగ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (09:07 IST)
ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. అతనికి షాకివ్వాలని పాకిస్థాన్ రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇప్పటికే హఫీజ్ రాజకీయ పార్టీ పెట్టాడు. లాహోర్‌లో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించాడు. ఉగ్రవాది పాకిస్థాన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఇంకా ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీలు విరాళాలు సేకరించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండర్ ఎక్స్ఛేంజి  కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ఎస్ఈసీపీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉగ్రవాది ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్-ఉద్-దవా(జేయూడీ), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)‌లకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న జేయూడీ, లష్కరే తాయిబాతోపాటు మరో రెండు సంస్థలపై నిషేధం విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments