Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ సైనికులపై ఆత్మాహుతి దాడి.. స్కెచ్ వేసింది.. పాకిస్థానీయుడే..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:13 IST)
పుల్వామా దాడి విషయంలో తమకే పాపం తెలియదని ఇమ్రాన్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే జైషే మహ్మద్ రెండో వీడియోను విడుదల చేసింది. పుల్వామా దాడి తమ పనేనని మరోమారు స్పష్టం చేసింది.
 
పుల్వామా వంటి దాడులను తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలమని జైషే ఆ వీడియోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడితో 27 మంది ఇరాన్ సైనికులను కూడా పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది కూడా పాకిస్థాన్‌కు చెందిన వాడేనని ఇరాన్ ఆరోపించింది. 
 
ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దులో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా తరహాలోనే ఇరాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 27 మంది సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ సైనికులపై దాడికి పాల్పడింది పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ తేల్చేసింది. 
 
అంతేగాకుండా ఈ దాడికి స్కెచ్ వేసింది కూడా పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ గార్డ్స్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ పాక్‌పౌర్ తెలిపారు. తాజా ఉగ్రదాడి పాకిస్థానీయుల పనేనని తొలిసారి బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments