Webdunia - Bharat's app for daily news and videos

Install App

131కి చేరిన కరోనా మృతుల సంఖ్య.. భారత వైద్య విద్యార్థికి కరోనా సోకిందా?

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (11:16 IST)
చైనాలో కరోనా వైరస్‌ ప్రాణాంతకంగా మారింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా మరో 24 మంది మరణించడంతో మృతుల సంఖ్య 131కి చేరిందని, 4,515 న్యుమోనియా కేసులు నమోదయ్యాయని చైనా ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు 20 విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్నిఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు.
 
భారత్‌లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని ఆయన తెలిపారు. చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్‌కి పంపనున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. చైనా దేశంలోని వూహాన్ నగరంలోని వైద్యకళాశాలలో చదువుతున్న మ‌ధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ లక్షణాలు సోకాయని అనుమానిస్తున్నారు. ఆ విద్యార్థి తన స్వస్థలమైన ఉజ్జయిని నగరానికి ఈ నెల 13వ తేదీన వచ్చారు. వూహాన్ నగరం నుంచి వైద్య విద్యార్థి రావడంతో అతనికి కూడా ఈ వైరస్ సోకి ఉండొచ్చని అనుమానించారు.
 
దీంతో అతన్ని వెంటనే ఉజ్జయిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని జిల్లా కలెక్టరు శశాంక్ మిశ్రా చెప్పారు. ఉజ్జయిని వైద్యవిద్యార్థి రక్తనమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణేలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని కలెక్టరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments