Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధిమార్చుకోని తాలిబన్ తీవ్రవాదులు : మహిళల వాయిస్ బంద్

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (17:06 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాంతిపలుకులు పలికిన తాలిబన్ తీవ్రవాదులు.. ఆచరణలో మాత్ర తమ బుద్ధిని మార్చుకోలేదు. ఫలితంగా తమ కఠినమైన షరియా చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. సంగీతం లేదా పాటలు,  టీవీలు, రేడియో ఛానళ్లలో ఆడవాళ్ల వాయిస్‌ని బ్యాన్ చేయాలని కాందహార్‌లోని టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లను తాలిబన్ ఆదేశించింది. 
 
వాస్తవానికి తాము పూర్తిగా మారిపోయామని, ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు.. మహిళలు చదువుకోవచ్చు.. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు వారు అంగీకరించడం లేదు. 
 
కాగా, ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు అప్ఘానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు మీడియా సంస్థలు తమ ఫీమేల్ (ఆడవాళ్లు) యాంకర్లను తొలగించిన కొద్ది రోజుల్లోనే తాలిబన్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం. ఇక,పలువురు మీడియా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా ఇటీవల అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments