Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాసా' పోటీల్లో సత్తా చాటిన తెలుగోళ్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (17:47 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిర్వహించిన పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల్లో ముఖ్యంగా మహిళలు తమ సత్తా చాటారు. చంద్రుడిపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా ఈ పోటీలను నాసా నిర్వహించింది. ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన బృందం సత్తా చాటింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా, తెలుగు బృందం టాప్‌-10లో నిలిచి 25 వేల డాలర్లు (సుమారు రూ.18.8 లక్షలు) గెల్చుకోవడంతోపాటు రెండోదశ పోటీలకు ఎంపికైంది. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే చర్యల్లో భాగంగా ‘నాసా’ గత ఏడాది నవంబరులో ఈ పోటీలకు శ్రీకారం చుట్టింది. 
 
‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ చాలెంజ్‌’ పేరుతో చేపట్టిన పోటీలకు ఔత్సాహిక పరిశోధకుల నుంచి ప్రాజెక్ట్‌లను ఆహ్వానించింది. దీంతో వెయ్యికిపైగా ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 48 దేశాలకు చెందిన 374 ప్రాజెక్టులను పోటీలకు ఎంపిక చేసింది. 
 
రాష్ట్రానికి చెందిన కరణం ఆశీష్ కుమార్‌, అమరేశ్వర ప్రసాద్‌ చుండూరు, ప్రణవ్‌ ప్రసాద్‌ రూపొందించిన ఎల్‌-వాటర్‌(లూనార్‌ వాట ర్‌ అబ్‌స్ట్రాక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బై ఎక్సకవేషన్‌ ఆఫ్‌ రెగోలిత్‌) ప్రాజెక్ట్‌ టాప్‌-10లో నిలిచింది. 25 వేల డాలర్లను బహుమతిగా గెల్చుకోవడంతో పాటు రెండో దశ పోటీలకు ఎంపికైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments