Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ పెట్టుకోలేదని ప్రధానికి ఫైన్... ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:21 IST)
thai PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది.
 
మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని వ్యాక్సినేషన్‌కు సంబందించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా మాస్క్ ధరించి ఉండగా ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా మాత్రం మాస్క్ పెట్టుకోలేదు.
 
ఈ ఫోటోలను ప్రధాని వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో విషయం వెలుగుచూసింది. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంతో అతడికి జరిమానా విధించారు అధికారులు. ఉల్లంఘన కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ స్పందించారు. ప్రధానిని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments