Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు!

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (12:09 IST)
ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వశమైంది. దీంతో ఆయన అనేక మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటుందని పేర్కొంటూ ఉద్యోగులపై వేటు వేశారు. అలా సగం మందిని ఇంటికి పంపించారు. వీరిలో చాలా మందిని మళ్లీ వెనక్కి పిలుస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తిరిగి రమ్మని వారికి లేఖలు రాస్తున్నారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యురేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులలో సగం మందిని ఇంటికి పంపించారు. ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరముందని ఆలస్యంగా గ్రహించారు. 
 
కొందరు ఉద్యోగుల తొలగింపులో పొరపాటు జరిగిందని, అందువల్ల అలాంటి వారిని తిరిగి చేర్చుకుంటున్నట్టు పేర్కొంది. ట్విటర్‌లో ఆ సంస్థ కొత్త యాజమాన్యం ఎలాన్ మస్క్ తీసుకునిరాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల సేవలు ఎంతో అవసరమని ఉందని భావించినట్టు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులలో కొంతమందికి తిరిగి వచ్చేయాలంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్టు బ్లూమ్ బర్గ్ తెలిపింది. అయితే, ఈ కథనంపై ట్విట్టర్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, బ్లూ టిక్ చార్జీల పెంపును అమలు చేసేందుకు అవసరమైన మార్పులను ట్విట్టర్ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం