Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఘోరం.. కత్తితో వీరంగం.. కనిపించినోళ్లని పొడిచేశాడు..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (11:11 IST)
జపాన్‌లో ఘోరం జరిగింది. కనిపించిన వాళ్లను పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఓ దుండగుడు. ఆపై తనను తాను గాయపరుచుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద.. మంగళవారం ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్లు కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో 16మంది గాయాలపాలయ్యారు. 
 
గాయపడిన వారిలో ఎనిమిది మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వున్నారు. కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో భయంతో రైలు ప్రయాణీకులు పరుగులు తీశారు. అయితే 16మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. 
 
ఈ సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు 50 ఏళ్ల లోపు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారితో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments