Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 72 గంటలు అత్యంత కీలకం.. ఏమైనా జరగొచ్చు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:07 IST)
భారత వైమానిక దళం దాడులను పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఈ దాడులకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రైల్వే మంత్రి ఖాజా రఫీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమన్నారు. ఈ సమయంలో ఏమైనా జరగొచ్చన్నారు. ఒకటి యుద్ధమా? లేదా శాంతి? అనేది 72 గంటల్లో తేలుతుందన్నారు. 
 
ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా భీకరంగా ఉంటుందని ఈ పాక్ మంత్రి అన్నాడు. పైగా, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమంటూ జరిగితే ఇదే చివరి యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, మంగళవారం తెల్లవారుజామున 12 యుద్ధవిమానాలతో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వెయ్యి కేజీల ఆర్డీఎక్స్‌ను వేయడంతో.. క్షణాల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపు దాడుల్లో 300 మంది పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో పాకిస్థాన్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments