Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం పెంచలేని యజమానిని చంపేసిన కార్మికుడు...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:49 IST)
అబుదాబిలో ఉపాధి కోసం వెళ్లిన పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్మికుడు హంతకుడిగా మారాడు. జీతం పెంచలేదన్న అక్కసుతో తన యజమానిని చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అబుదాబిలో నివాసముంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఓ కార్మికుడు పనిచేస్తున్నాడు. అతడి జీతాన్ని పెంచుతానని మాటిచ్చిన బాస్ మాట మీద నిలబడలేదు. జీతం పెంచాలని కార్మికుడు పలుమారు ప్రాధేయపడ్డాడు. కానీ ఇంటి యజమాని తిరస్కరించాడు. దీంతో కోపం పెంచుకుని బాస్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
తన స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్లి మాసం కోసే ఓ కత్తిని కొనుగోలు చేశాడు. తన బాస్‌కు ఫోన్ చేసి.. స్నేహితుడి వద్దకు వెళ్లే పనుందని, కారులో తనను అక్కడ దించిరమ్మంటూ కోరాడు. కారులో దించేందుకు వచ్చిన బాస్‌ను నగర శివార్లకు తీసుకెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో హత్య చేశారు. 
 
మృతదేహంతోపాటు కారును మృతుడి ఇంటి ముందు ఉంచి అతడి ల్యాబ్‌టాప్, డబ్బులు దొంగిలించుకుని పారిపోయాడు. మరునాడు ఉదయం మున్సిపల్ కార్మికులు కారులోని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments