Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవల్లి కథ అలా పుట్టింది.. జక్కన్న మహాభారతం తీసే ఛాన్సుంది: విజయేంద్ర ప్రసాద్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం శ్రీవల్లి అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు... ఆ చిత్రానికి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:16 IST)
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం శ్రీవల్లి అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు... ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ సినిమాపై విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఆలోచనలకు.. మానసిక విశ్లేషణకు అనుగుణంగా ఈ కథ వుంటుందని చెప్పారు. వైజాగ్‌లో తనకు రమేష్ అనే మిత్రుడుండే వాడని.. అతడు 2010లో వినాయక చతుర్థి  ముందు రోజే చనిపోయాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
తనకోసం ఎంతో కాలం వేచి చూసిన ఆయన.. చివరి క్షణాల్లో తనను తలచుకున్నాడని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తన మిత్రుడిని చూడాలనుకున్నా.. వైజాగ్‌కు ఆతడు చనిపోయిన రెండేళ్లకు తర్వాత వెళ్లి.. షాక్ అయ్యానన్నారు. 2010లో వినాయక చవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని అన్నారు. మనసు రమేష్ వైపే లాగిందని, అయితే అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్‌లోని అతనింటికి వెళ్తే.. అంతలో అతడు కన్నుమూశాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ బాధలో నుంచి శ్రీవల్లి కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
 
ఇక బాహుబలి దర్శకుడు, తనయుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భావించే మహాభారతం గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకుముందు తానెక్కడా చెప్పలేదన్నారు. కానీ ప్రస్తుతానికి చెప్పేదేమిటంటే.. జక్కన్న తప్పకుండా మహాభారతం తీసే అవకాశం ఉందని తెలిపారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చునని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments