Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ Vs ఢిల్లీ క్యాపిటల్స్.. అగ్రస్థానానానికి ఢిల్లీ.. హైలైట్స్.. రికార్డులివే..

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (14:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్... రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపును నమోదు చేసుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మరోమారు ఢిల్లీ కేపిటల్స్ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 148 పరుగులకే చేతులెత్తేసింది.
 
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అద్భుతమైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతిలో హాఫ్ సెంచరీ చేసిన ధావన్‌కు ఇది ఐపీఎల్‌లో 39వ హాఫ్ సెంచరీ. దీనికంటే ముందు ధావన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మలతో 38 అర్థశతకాలు చేసిన భారత ఆటగాడిగా వారితో సమానంగా ఉన్నాడు.
 
అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మ్యాచ్ ముంబై ఇండియన్స్‌‌పై 52 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసాడు ధావన్. కానీ అందులో చాలా నెమ్మదిగా ఆడటంతో అతనిపై విమర్శలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్‌లో ధావన్ కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు చేసాడు. ఇక ధావన్‌కు ఐపీఎల్ టోర్నీలో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
 
అలాగే ఐపీఎల్‌ 2020లో దక్షిణాఫ్రికా పేసర్ నోర్జే అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్ ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నోర్జే.
 
బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నోర్జే నిలిచాడు. ఆ మరుసటి బంతికే రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. 
 
అంతేగాకుండా ఐపీఎల్‌లో రెండో, మూడో వేగవంతమైన బంతులు బౌలింగ్ చేసిన బౌలర్‌గానూ ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 155.2 కి.మీ/గంటకు, 154.7 కి.మీ/గంటకు వేగంగా బంతులను సంధించి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బంతులు సంధించి, ఒకే మ్యాచ్‌లో బౌర్ నోర్జే ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నోర్జే 4-0-33-2 గణాంకాలతో రాణించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

తర్వాతి కథనం
Show comments