Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.వెయ్యికే 4జి ఫోన్?... జియోకు షాక్...

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది. రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో 4జి ఫీచర్‌ ఫోన్ల పోరు మొద

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (10:02 IST)
టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది. రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో 4జి ఫీచర్‌ ఫోన్ల పోరు మొదలైంది. 
 
ఇటీవల ఉచితంగా రిలయన్స్‌ జియో 4జి ఫీచర్‌ ఫోన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా సరికొత్త ఫీచర్‌ ఫోన్‌ తీసుకొస్తున్నట్టు సమాచారం. 
 
జియో ఫోన్‌ ధర రూ.1,500 ఉండగా ఎయిర్‌టెల్‌ తన 4జి ఫోన్‌ని రూ.1000లకే అందించబోతోందని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే రిలయన్స్‌ జియో మాదిరిగా ఎయిర్‌టెల్‌ కూడా మూడేళ్ల తర్వాత ఈ ఫోన్‌ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
 
దాదాపు 50 కోట్ల వరకు ఉన్న ఫీచర్‌ మొబైల్‌ ఫోన్ల వినియోగదారులను 4జి సేవలవైపు మళ్లించేందుకు జియో ఈ ప్రయోగానికి తెరతీసింది. దీంతో జియో పోటీని ఎదుర్కోవాలంటే తామూ అదే వ్యూహంతో వెళ్లక తప్పదని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments