Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ కలవనున్న ఎయిర్‌టెల్.. మైక్రోసాఫ్ట్‌తో జియో చర్చలు?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (19:39 IST)
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కంపెనీతో ప్రపంచ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ జోడీ కట్టనుంది. ఇందులో భాగంగా భారతీ ఎయిర్‌టెల్ సంస్థ అమేజాన్ కు రూ. 15 వేల కోట్ల వాటాను విక్రయించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌ దేశంలో రూ.30 కోట్ల వినియోగదారులతో మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా కొనసాగుతోంది. ఈ ఒప్పందాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. 
 
కానీ ఈ వార్తలను ఊహాగానాలంటూ కొందరు సంస్థ ప్రతినిధులు కొట్టిపారేశారు. ఇంకా భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై తామిప్పుడే స్పందించలేమని తెలిపారు.

అయితే మొబైల్‌ రంగంలో రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమేజాన్‌తో కలవడం వల్ల సంస్థ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియాలో వాటాను కొనుగోలు చేయడానికి గూగుల్ ప్రత్యేక చర్చలు జరుపుతున్నందున భారతి ఎయిర్‌టెల్‌పై అమేజాన్ ఆసక్తి కనబరిచిందని సమాచారం. ఇప్పటికే ఫేస్‌బుక్ రిలయన్స్ జియో నుంచి 9.99శాతం వాటాను కొనుగోలు చేసింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సక్సెస్ అయితే 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవచ్చునని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments