Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు పోటీ : రూ. 2000కే బీఎస్ఎన్ఎల్ ఫీచ‌ర్ ఫోన్‌...

రిలయన్స్ జియోకు పోటీగా ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ ఫీచర్ ఫోనును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఇపుడు ఈ కోవలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (07:06 IST)
రిలయన్స్ జియోకు పోటీగా ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ ఫీచర్ ఫోనును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఇపుడు ఈ కోవలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది. 
 
త్వరలోనే జియో తరహాలో రూ.2000కే ఫీచ‌ర్ ఫోన్ విడుద‌ల చేసే సన్నాహాల్లో నిమగ్నమైంది. వీలైతే దీపావ‌ళి పండుగ‌లోగా ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్‌ఫోన్ త‌యారీ కోసం మైక్రోమాక్స్‌, లావా వంటి మొబైల్ త‌యారీ కంపెనీల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. 
 
కాగా, రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేసి, 4జీ ఫీచర్ ఫోనును ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఇతర ఆప‌రేట‌ర్లు కూడా ఫీచ‌ర్ ఫోన్ల త‌యారీ ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌, ఐడియాలు ఫీచ‌ర్‌ఫోన్లను విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments