రాహుల్ గాంధీ ట్వీట్‌ను డిలీట్ చేసిన ట్విట్టర్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:21 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌ను ట్విట్టర్ ఇండియా తొలగించింది. ఢిల్లీలో అత్యాచారం మరియు హత్య కేసు బాధితురాలి తల్లిదండ్రులను కలిసిన ఫోటోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఈ చిత్రంలో  బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.
 
ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు చిల్డ్రన్స్ కమిషన్ రాసిన లేఖలో, మైనర్ బాధితుల కుటుంబ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సెక్షన్ 74 మరియు బాల లైంగిక నిరోధం సెక్షన్ 23 కింద నేరం.. నేరాల చట్టం (POCSO) ఉల్లంఘన కూడా అని చెప్పింది. ముఖ్యంగా అత్యాచార బాధితురాలి ఫోటోను, వారి ఐడెంటిటీని బహిర్గతం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్ స్పష్టంచేసింది.
 
ఈ విషయమై ట్విట్టర్ ఇండియా స్పందించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్ట్ ఉన్నట్లు గుర్తించామని, ట్వీట్‌ను తొలిగిస్తున్నట్లుగా నోటిఫికేషన్ ద్వారా రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చి ట్వీట్‍ను తొలిగించింది.
 
ఢిల్లీలోని కాంట్ ప్రాంతంలో 9 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించగా.. 55 ఏళ్ల వయసున్న ఓ పూజారి, మరో ముగ్గురు బాలికను హత్య చేసి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లుగా చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వారికి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
 
బిడ్డ మృతిపై అనుమానాలు రావడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఒక పూజారి సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం