Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్, పాన్ అనుసంధానానికి 31వ చివరి తేదీ.. అలా చేయించకపోతే పాన్..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (15:27 IST)
ఆధార్, పాన్ అనుసంధానానికి చివరి తేదీ ఈ నెల 31. ఈ గడువులోగా వీటిని అనుసంధానం చేయించకపోతే పాన్ చెల్లదు. అంతేకాకుండా రూ.1,000 వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లు, 2021లో ఈ నిబంధనలు ఉన్నాయి. 
 
ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్‌ సంఖ్యను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా కోరినపుడు, ఆ వ్యక్తి ఆ విధంగా తన ఆధార్ సంఖ్యను తెలియజేయడంలో విఫలమైతే, గరిష్ఠంగా రూ.1,000 వరకు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా రుసుమును విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ బిల్లులో సెక్షన్ 234హెచ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. 
 
మార్చి 31నాటికి ఆధార్, పాన్‌లను తప్పనిసరిగా అనుసంధానం చేయించుకోవాలి. ఆధార్‌ను మెయింటెయిన్ చేయకపోతే పాన్ పని చేయదు. ఫలితంగా ఎదుర్కొనవలసిన పర్యవసానాలకు అదనంగా ఈ రుసుమును చెల్లించాలి. రూల్ 114ఏఏఏ ప్రకారం, పాన్‌ను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి పాన్ పనిచేయని స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించలేదని పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments