విండోస్ 10 మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిపివేత...

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (18:15 IST)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 10 మొబైల్స్‌ కథ ముగిసిపోయింది. ఈ మొబైల్స్‌కు ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించబోమని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ఫోన్లకు చివరి అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ డిసెంబర్ 10న విడుదల చేసింది. 
 
అందులో పలు సెక్యూరిటీ ప్యాచ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉన్నాయి. అయితే విండోస్ 10 మొబైల్‌లో వాడే వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర ఆఫీస్ యాప్స్‌కు 2021 జనవరి 12వ తేదీ వరకు సపోర్ట్ ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ క్రమంలో ఆ తేదీ లోగా విండోస్ 10 మొబైల్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్లను మార్చాల్సి ఉంటుంది.
 
ఇదిలావుంటే, గత 2015లో నవంబరు నెలలో మొదటిసారిగా విండోస్ 10 మొబైల్ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టగా.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దెబ్బకు ఆ ఓఎస్ నిలబడలేకపోయింది. దీంతో 2017లో విండోస్ 10 మొబైల్ ఓఎస్ డెవలప్‌మెంట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇక ఇప్పుడు చివరి అప్‌డేట్‌ను ఆ ఓఎస్ కోసం మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. దీంతో ఆ మొబైల్స్ కథ ఇక ముగిసినట్లయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments