Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సంక్రాంతి ఆఫర్.. రోజుకు 5జీబీ డేటా

రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా వెల్లడించింది. గతవారం పలు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను రూ.50 వరకు తగ్గించడంతోపాటు కొన్ని ప్లాన్లకు 50 శాతం అదనపు

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (16:00 IST)
రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా వెల్లడించింది. గతవారం పలు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను రూ.50 వరకు తగ్గించడంతోపాటు కొన్ని ప్లాన్లకు 50 శాతం అదనపు డేటాను అందిస్తూ ఆయా ప్లాన్ల ధరలను మార్చిన విషయం తెలిసిందే. 
 
కాగా జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా పలు ప్లాన్ల టారిఫ్‌లకు అందించే డేటా, వాలిడిటీ బెనిఫిట్స్‌ను పెంచాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మళ్లీ జియో రంగంలోకి దిగింది. దీంతో తాను అందిస్తున్న రూ.509, రూ.799 ప్లాన్ల బెనిఫిట్స్‌ను మార్చేసింది. 
 
ఈ ప్లాన్లలో భాగంగా, రూ.509 ప్లాన్‌లో ఇప్పటివరకు రోజుకు 2 జీబీ డేటా ఇచ్చేది. దీన్ని ఇకపై 3జీబీ డేటాకు పెంచింది. అయితే, కాలపరిమితిని మాత్రం 49 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించింది. 
 
అలాగే రూ.799 ప్లాన్‌లో ఇప్పటివరకు రోజుకు 3జీబీ డేటా లభించగా ఇప్పుడు దాన్ని జియో రోజుకు 5జీబీ వరకు పెంచింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే, ఎయిర్‌టెల్‌లో రూ.799 ప్లాన్‌లో రోజుకు 3.5 జీబీ మాత్రమే లభిస్తుండడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments