Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందా?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:48 IST)
ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రస్తుత సిఈఓ సుందర్ పిచాయ్ మన భారతీయుడు. గూగుల్ యాజమాన్యం మాత్రం అనేకమందిని, అనేక రకాలుగా పరీక్షించి ఏరికోరి మరీ పిచాయ్‌ను సిఈఓగా నియమించింది. అయితే ఇప్పుడు ఈ భారతీయ నాయకుడిపై నమ్మకం సన్నగిల్లుతోందట. అయితే ఆ అపనమ్మకం వేరే ఎవరికో కాదు గూగుల్ ఉద్యోగులకేనట.
 
వివరాల్లోకి వెళితే గూగుల్ సంస్థ ప్రతి ఏడాది అనేక అంశాలపై తమ సంస్థలోని ఉద్యోగుల అభిప్రాయాలను సేకరిస్తుంది. దీని కోసం గూగులెగిస్ట్ పేరుతో వార్షిక పోల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సుందర్ పిచాయ్ పనితీరు గురించి ఆయన నాయకత్వంలో సంస్థ మరింత ముందుకు వెళ్తుందా అన్న ప్రశ్నకు 78 శాతం మంది అవును అని తెలిపారు, అయితే ఇదే ప్రశ్నకు గతేడాది 88 శాతం మంది అనుకూలంగా ఓటువేసారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం ఉద్యోగుల్లో పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లినట్లు సమాచారం.
 
పిచాయ్ తీసుకునే నిర్ణయాలు వ్యూహాలు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయనే దానికి బదులుగా 75 శాతం మంది అనుకూలంగా స్పందించారు... అయితే గతేడాదితో పోల్చితే ఈ విషయంలో కూడా 13 శాతం మంది అపనమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. రోజురోజుకీ తనపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో పిచాయ్ తన సంస్థ భవిష్యత్తు కోసం ఏవైనా సంస్కరణలు చేపడతాడో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments