మహాశివుడిని ఎలా పూజించాలంటే?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (17:39 IST)
మహాశివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా.. ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు.
 
శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. శివరాత్రి పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించవచ్చు.
 
నైవేద్యంగాకొబ్బరికాయ శివుడికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. శివలింగం ముందు కొబ్బరికాయ కొట్టి.. ఆ నీటిని లింగంపై ధారగా పోయాలి. కొబ్బరి ముక్కలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు శివుడికి ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం ద్వారా సకల సుఖ, సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలి.. తల పట్టుకున్న ఎన్డీయే.. ప్లాన్ ఏంటి?

అన్నదాత సుఖీభవ పథకం- మొదటి విడత నిధుల విడుదల

Telangana: తెలంగాణలో ఎల్లో అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

తర్వాతి కథనం
Show comments