Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి జాగరణ.. వసుమతి కథను వింటే..?

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (17:11 IST)
శివరాత్రి జాగరణ చేసేవారు ఈ కథను చదివితే సర్వాభీష్టాలు చేకూరుతాయి. వసుమతి శివరాత్రి వ్రతం ఆచరించడం ద్వారా శివుని అనుగ్రహం పొందింది. శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా దండకారణ్యంలో భాగంగా అడవిలో కృష్ణానదీ తీరాన నివసించారు. 
 
అదే ప్రాంతంలో మునులు కూడా ఆశ్రమం ఏర్పరుచుకుని నివసించేవారు. వారిలో ఒకరే విద్వవజిహ్వర్. ఆయనను చూసేందుకు కౌస్తిమతి అనే ఋషి వచ్చారు. విద్వవజిహ్వర్ ఆయనను స్వాగతించి.. అతిథి సత్కారాలు అందించారు. విద్వవజిహ్వర్ యుక్త వయస్సులోనే సన్యాసం స్వీకరించాడు. అయితే ఇది సరికాదని, వివాహం చేసుకోవాలని.. సంతానం పొందాలని లేకుంటే పితరుల శాపానికి కారణం అవుతారని కౌస్తిమతి హితబోధ చేశారు. అందుకే అగస్త్య మహాముని లోపముద్రను వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. 
 
అంతేగాకుండా కౌస్తిమతి తన కుమార్తె వసుమతిని వివాహం చేసుకోమని అభ్యర్థిస్తాడు. కానీ విద్వవజిహ్వర్ అందుకు అంగీకరించలేదు. సంసార సాగరంలో మునిగి ఇబ్బందులు ఎదుర్కోవడం సరికాదన్నాడు. తానే తండ్రి మారీచుడి నుంచి దూరమై తపస్సు చేసుకుంటున్నాను. 
 
అయినా తన కర్మ వదలనంటోందని చెప్పుకొచ్చాడు. అయినా కౌస్తిమతి వదలలేదు. తాతయ్య అయిన భరద్వాజ మహర్షి సంసారంలో మునగడం వల్లే విద్వవజిహ్వర్ కలిగారని తెలిపారు. ఇంకా తన కుమార్తె వసుమతి సాధారణ మహిళ కాదు. 
 
గౌతమ మహర్షి మనవడిని తాను. సదానంద మహర్షికి మనవరాలే వసుమతి. పతీవ్రతా శిరోమణులైన పాంచాలీ, సీత, అరుంధతి, అనసూయలకు సమానురాలు. అయినా విద్వవజిహ్వర్ ఒప్పుకోలేదు. ఇంకా దుర్వాస మహర్షి, కన్వ మహర్షి, మార్కండేయుడు, నారదుల వంటి వారు వివాహం చేసుకోకుండా జీవించలేదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. 
 
దీంతో కౌస్తిమతి తన తపోశక్తితో శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో విద్వవజిహ్వర్ వారు ఎందుకు వివాహం చేసుకోలేదనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. దీంతో భూలోకానికి చేరిన కౌస్తిమతి వసుమతి, విద్వవజిహ్వర్ వివాహాన్ని ఘనం నిర్వహించాడు. 
 
ఇంకా వసుమతి శివరాత్రి రోజున వ్రతం ఆచరించడం ద్వారా శివుడిని ప్రత్యక్ష దర్శనాన్ని పొందగలిగింది. అందుచేత శివరాత్రి రోజున జాగరణ చేసేటప్పుడు వసుమతి కథను చదివితే సౌభాగ్యం సిద్ధిస్తుందని శివపురాణం చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments