Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాంతులొస్తున్నాయని కిటికీల వైపు తలపెట్టిన బాలిక.. బంతిలా ఎగిరిపడిన తల..!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (20:09 IST)
సాధారణంగా ప్రయాణాలు చేస్తుంటే వాంతులు వస్తే బస్సు కిటికీల వైపు తలపెట్టేస్తుంటాం. అలా పెట్టడంతో మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. వాంతులు రావడంతో బస్సు కిటికీలో తల బయటకు పెట్టిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ పాప తల మొండెం తెగిపడింది.

ఈ ఘటన ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేగాకుండా.. కళ్ల ముందు కుమార్తె మృతదేహం చూసీ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్‌ వద్ద ఇండోర్‌-ఇచ్చాపూర్‌ రహదారి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. సోదరి, తల్లితో కలిసి ఇండోర్ వెళ్లేందుకు 13 ఏళ్ల బాలిక బస్సు ఎక్కింది. బస్సు రోషియా ఫేట్‌కు చేరుకోగానే వాంతులు వచ్చాయి. దీంతో తల్లి వెంటనే బాలికను బస్సు కిటికీలో తల పెట్టించింది. అయితే ఈలోపు అవతలి వైపు నుంచి దూసుకుంటూ వచ్చిన టక్కు పాప తలను వేగంగా ఢీకొట్టింది. దీంతో పాప మొండెం, తల వేరుపడింది. 
 
బంతిలా బాలిక తల ఎగిరిపడడంతో ఈ ఘటన చూసిన వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. బస్సులో కూర్చున్న తల్లి, సోదరి నిర్ఘాంతపోయి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని లబోదిబోమని రోదించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments