Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌: ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది మృతి

Webdunia
బుధవారం, 18 మే 2022 (16:04 IST)
గుజరాత్‌లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బి జిల్లా హల్వాద్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందికిపైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరికొంత మంది మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు.  
 
క్షతగాత్రులును స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
కాగా, మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో చాలా మంది కూలీలు తినడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. లేదంటే.. చాలా మంది ఈ ప్రమాదంలో బాధితులయ్యేవారని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments