Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుల వర్షం - 16 మంది మృతి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (08:51 IST)
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ పిడుగులపాటుకు ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే  పిడుగుపాటుతో 16 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివవరకు కురిసిన పిడుగుల వర్షానికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం ఈస్ట్ చంపారాన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్ జిల్లాలో ముగ్గురు, వెస్ట్ చంపారాన్ జిల్లాలో ఇద్దరు, అరారియ జిల్లాలో ఇద్దరు బంకా ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, ఈ పిడుగల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments