Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లలో 17,675 మంది రైతు ఆత్మహత్యలు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (03:49 IST)
గత మూడేళ్లలో దేశవ్యాపితంగా 17,675 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో 1,368 మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. 
 
ఎన్‌సిఆర్‌బి వెబ్‌సైట్‌లో 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మాదక ద్రవ్యాలకు బానిసలవడం, వివాహేతర సంబంధ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, దివాలా తీయటం, రుణాలు, పరీక్షల్లో ఫెయిల్‌, నిరుద్యోగం, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఆస్తి తగాదాలు తదితర కారణాలతో రైతులతో సహా పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా 2017లో 5,955, 2018లో 5,763, 2019లో 5,957 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే సంభవించాయని అన్నారు.

మహారాష్ట్రలో 7,345 మంది, కర్ణాటకలో 3,853 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,368 మంది, తెలంగాణలో 2,237 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments