Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు బావిలో మంటలు.. ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (17:44 IST)
అస్సోం ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు బావిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తీన్‌సుకియా జిల్లా బాగ్‌జాన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మంటలను అదుపు చేసేందుకు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
 
వివరాల్లోకి వెళితే.. చమురు బావిలో భారీ ఎత్తున మంటలు చెలరేగి సుమారు 30 కిలోమీటర్ల వరకూ దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, మంటల్లో మృతిచెందిన వారిని కంపెనీ ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఆపరేటర్లు దుర్లోవ్ గొగోయ్, తికేశ్వర్ గొహైన్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
 
ఓఎన్‌జీసీకి చెందిన అగ్నిమాక సిబ్బంది ఒకరు కూడా మంటలను అదుపు చేసే క్రమంలో స్వల్పంగా గాయపడ్డారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అసోం ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి ప్రస్తుతం ఇంకా అదుపులోకి రాలేదని, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేంద్ర మంత్రులతో మాట్లాడారని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్ శుక్లాబైద్య తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments