Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్వార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బ‌లంగా ఢీకొట్ట‌ింది. ఈ ప్రమాదంలో కారులోవున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం అల్వార్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం 5.30 గంట‌ల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు సీట్ల కెపాసిటీగ‌ల కారులో మొత్తం 8 మంది ఉన్నార‌ని, ప్ర‌మాదంలో ఆ కారులోని ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందార‌ని పోలీసులు చెప్పారు. 
 
మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. కారులోని వారు క‌థుమార్‌లో గోవ‌ర్ధ‌న్ ప‌రిక్ర‌మ నిర్వ‌హించి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments