Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు యువకుల కాల్చివేత

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (09:20 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సోంలో వేర్పాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఒకరి తర్వాత మరొకరిపై తుపాకులతో కాల్పులకు పాల్పడి హతమార్చారు. ఆ తర్వాత వారి శవాలను బ్రహ్మపుత్ర నదీ తీరంలో పడేసి వెళ్లిపోయారు. 
 
కాగా గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ ఐదుగురు యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. వారికోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా వారి మృతదేహాలు నదీ తీరంవద్ద ఉండటంతో తీవ్రంగా విలపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులేనని గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments