Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్ల బాలికపై ఐదు నెలలపాటు 17మంది అత్యాచారం..

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:57 IST)
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై 17మంది కామాంధులు గత ఐదునెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై చిక్కామంగళూరు జిల్లా శ్రీంగేరి పోలీసులకు జిల్లా బాలల సంక్షేమ సంఘం ఛైర్మన్ ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషింగ్ యూనిట్ లో 15 ఏళ్ల బాధిత బాలిక పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది. 
 
మొదట బాలికపై బస్సు డ్రైవరు గిరీష్ అత్యాచారం చేశాడు. బస్సు డ్రైవరు అందించిన సమాచారంతో అభి అనే మరో యువకుడు బాలికపై అత్యాచారం చేసి ఆమె అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం అభి స్నేహితులు అశ్లీల ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారు కూడా అత్యాచారం చేశారు. బాధిత బాలిక తల్లి మరణించడంతో ఆమె అత్త ఇంట్లో నివాసముంటోంది.
 
బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురించి అత్తకు తెలిసినా పట్టించుకోలేదని, ఈ దారుణ ఘటనలో అత్త కూడా నిందితురాలేనని జిల్లా ఎస్పీ శ్రుతి చెప్పారు. ఈ ఘటనలో నిందితులైన అభి, గిరీష్, వికాస్, మణికంఠ, సంపత్, అశ్వత్ గౌడ, యోగీష్, ఎంజీఆర్ క్రషర్ యజమాని, బాధిత బాలిక అత్తలను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 201, 370, 376(3), 376(ఎన్), పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments