Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు కరోనా.. మరోవైపు సైక్లోన్ ఎంఫాన్.. బెంగాల్‌లో బీభత్సం- 84మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (19:32 IST)
cyclone
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు సైక్లోన్ ఎంఫాన్ తన తీవ్రతను పశ్చిమ బెంగాల్ గడ్డపై చూపించింది. తుపాను తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 84 మంది మృతి చెందారు. ఒడిశాలో తుపాను తీవ్రత కారణంగా ఇద్దరు మృతి చెందారు. భీకర గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా నీట మునిగింది. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి చెందారు.  
 
ఇకపోతే.. ఎంఫాన్ తుపాను పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్‌ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సైక్లోన్ ప్రభావంతో పెద్ద వృక్షాలు నేలకూలాయి. చాలాప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో చీకటి అలముకుంది.
 
తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధానిని రాష్ట్రంలో స్వయంగా పర్యటించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆమె రెండున్నర లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments