Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో హద్దు మీరిన భార్య.. ఉరేసుకున్న భర్త.. కుమారుడికి విషమిచ్చి?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (19:16 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. సామాజిక ప్రసార మాధ్యమాల వల్ల మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో భార్య హద్దుమీరిన కారణంగా మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, శరవణంపట్టికి చెందిన అర్జున్ (46) టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అలమేలు (40) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. ఇతడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం పని ముగించుకుని ఇంటికి చేరుకున్న అలమేలు.. ఇంటి లోపల లాక్ అయి వుండటం గమనించి కిటికీలను తెరిచి చూసింది. 
 
అంతే.. భర్త, కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చూసి షాకైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి మొత్తం తనిఖీలు చేశారు. ఇలా పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. 
 
ఈ లేఖలో అలమేలు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని.. ఆమె వాట్సాప్‌లో హద్దుమీరిందని.. దీంతో మనస్తాపానికి గురైన తాను.. కుమారుడికి విషం ఇచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నానని రాశాడు. దీనిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments