Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా వైద్యురాలి గొంతు కోసి హత్య... 29 ఏళ్ల వైద్యుడే సర్జికల్ నైఫ్‌తో...

Webdunia
గురువారం, 2 మే 2019 (16:39 IST)
ఢిల్లీలోని రంజిత్ నగర్ లోని ఓ అపార్టుమెంట్లో 25 ఏళ్ల మహిళా వైద్యురాలు హత్యకు గురైంది. ఆమె శరీరంపై కత్తి గాట్లతో పాటు గొంతు కోసినట్లు వుంది. రక్తపు మడుగులో పడి వున్న ఆమె దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కరోల్ బాగ్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కి చెందిన 25 ఏళ్ల గరీమ మిశ్రాతో పాటు 29 ఏళ్ల చంద్రప్రకాష్ వర్మతో పాటు మరో వైద్యుడు కలిసి ఒకే అపార్టుమెంట్లో వేర్వేరు గదుల్లో అద్దెకు వుంటున్నారు. ఐతే మే 1వ తేదీ ఉదయం గరీమా నివాసముంటున్న అద్దె గది నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల ఆమె మృతదేహం రక్తపుమడుగులో పడి వుంది. ఆమె దేహంపై పదునైన కత్తిగాట్లు వున్నాయి. ఐతే ఆమెతో పాటుగా వుంటున్న 29 ఏళ్ల వైద్యుడు వర్మ కనిపించకపోవడంతో అతడే హత్య చేసి పరారై వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి వుంటాడేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments